మైనర్ తో అక్రమ సంబంధం…మొగుడిని చంపించేసింది !

wife killed Husband with Lover Help in Kavali District

ఆమెకి పెళ్లయి భర్త ఉన్నాడు, కానీ తప్పుడు దారిలో ఒక మైనర్ తో సంబంధం పెట్టుకుంది. చివరికి తమ బంధానికి అడ్డు వస్తున్నాడు అని భర్తను చంపించేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కావలి మండలం అన్నగారిపాలేనికి చెందిన జడ్డా సురేష్‌ను అతని భార్య రత్న, ఆమె ప్రియుడు గోళ్ల వెంకట నరసింహంతో హత్యచేయించినట్లు కావలి పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తనే హత్యచేయించినట్లు విచారణలో తేలింది. అన్నగారిపాలేనికి చెందిన బేల్దారి జడ్డా సురేష్‌ మన్నంగిదిన్నె-అన్నగారిపాలెం మధ్యలోనున్న అటవీప్రాంతంలో హత్యకు గురై శవంగా పడి ఉన్నాడు. దీనిపై సీఐ అశోక్‌వర్ధన్‌ విచారణ చేపట్టారు. విచారణలో ఏమి తేలిందంటే సురేష్‌ భార్య రత్న ఇదే గ్రామానికి చెందిన గోళ్ల వెంకటనరసింహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త ఆమెను నిలదీయడంతో హత్యకు కుట్రపన్నింది.

మైనర్ తో అక్రమ సంబంధం...మొగుడిని చంపించేసింది ! - Telugu Bullet

ఈనెల 18న సురేష్‌కు ఎక్కువగా మద్యం తాగించిన వెంకటనరసింహం ద్విచక్రవాహనంపై అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి, తాడుతో గొంతునులిమి హత్యచేశాడు. అయితే తనకు ఏమీ తెలియనట్లు తన భర్త కానరావడంలేదని సురేష్‌భార్య రత్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడు వెంకటనరసింహను తమదైన శైలిలో విచారణ చేయగా తానే హత్యచేసినట్లు ఒప్పుకుని వివరాలు వెల్లడించాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్ట్‌ చేశారు.