World Cup 2023 : విజృంభించిన బౌలర్లు..సెమీస్ లోకి దూసుకెళ్లిన భారత్

World Cup 2023: Booming bowlers. India rushed into the semis
World Cup 2023: Booming bowlers. India rushed into the semis

World Cup 2023 : ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ లో భాగంగా…నిన్న జరిగిన మ్యాచ్‌ లో టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.

బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటగా… బౌలింగ్ లో మహమ్మద్ షమీ, జస్ట్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్…. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ, జస్ట్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. సంచలన బౌలింగ్ తో 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు.