క్విట్ ఇండియా… క్విట్ ఏపీ

ys jagan mohan reddy tweets about on quit india movement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన కారణం. అంతకుముందు చాలా ఉద్యమాలు జరిగినా.. గాంధీజీ డూ ఆర్ డై అని పిలుపునిచ్చిన మొదటి ఉద్యమం ఇదే. ఈ ఉధ్యమం దెబ్బకు బ్రిటీష్ సైన్యంలో భారతీయులు కూడా తిరుగుబాటు చేశారు. దీంతో ఆంగ్లేయులు దిగిరాక తప్పలేదు. ఇప్పుడు క్విట్ ఇండియా డే సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

దోపిడీ పాలకులు, ప్రజావంచక పాలకులు క్విట్ ఏపీ అని జగన్ పిలుపునిచ్చారు. మొన్న నంద్యాల సభలో విమర్శలతో రాజకీయ దుమారం లేపిన జగన్… ఇప్పుడు మరోసారి ఫైరయ్యారు. అయితే జగన్ ట్వీట్ ఆయనకే వర్తిస్తుందని టీడీపీ వర్గాలు సెటైరేస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన దోపిడీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ చేయలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.

కానీ ఈ మధ్య కాలంలో జగన్ అనవసరంగా చాలా సార్లు శ్రుతి మించి మాట్లాడి పార్టీకి నష్టం తెస్తున్నారని వైసీపీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. నంద్యాల పోటాపోటీగా ఉన్న సీన్ కాస్తా… జగన్ విమర్శల తర్వాత టీడీపీ వైపు ఏకపక్షంగా పరిస్థితి మొగ్గిందని, ఇలాగే కంటిన్యూ అయితే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని వారు భయపడుతున్నారు.

క్విట్ ఇండియా... క్విట్ ఏపీ - Telugu Bullet

మరిన్ని వార్తలు:

నాకు వార‌సులు లేరు

ఇలా చేస్తే చెడు తగ్గి మంచి పెరుగుతుంది…

బీజేపీకి గ‌ట్టి దెబ్బ‌