కత్తి మీద వైసీపీ గుస్సా…

Jagan Padayatra Coverage Down Because of Kathi
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మన విల్లంబు నుంచి వదిలిన బాణం తిరిగి వచ్చి మననే గుచ్చుకుంటే ఎలా ఉంటుంది ? బాణం గుచ్చుకున్న నొప్పి కన్నా మనం వేసినదే వచ్చి మనకే తగిలిందన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో వైసీపీ కి బాగా తెలిసొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి కత్తి మహేష్ ని ప్రయోగించిన వైసీపీ కి ఇప్పుడు కొనసాగుతున్న పరిణామాలు ఏ మాత్రం కొరుకుడు పడడం లేదు. ఇంతకీ సంగతి ఏంటో తేల్చమంటారా ?

పవన్ ని తిడుతూ కత్తి మహేష్ నానా రచ్చ చేస్తుంటే బాగా ఎంజాయ్ చేసింది వైసీపీ శ్రేణులే. పవన్ ని ఇంత కన్నా ఎవరు బాగా బద్నామ్ చేయగలరు అన్నట్టు వైసీపీ అభిమానులు కూడా తమ వంతు సాయం చేశారు. దీంతో కత్తి మహేష్ ఏ ఛానల్ కి వెళ్లినా వైసీపీ వాళ్ళు ఆ చర్చలు ఫాలో అవ్వడంతో trp రేటింగ్స్ కూడా పెరిగిపోయాయి. ఇక న్యూస్ ఛానెల్స్ trp వచ్చే కార్యక్రమాలు , మనుషుల్ని వదిలి పెడతాయా ? ఇప్పుడు అదే వ్యవహారంతో కత్తి మహేష్ హీరోగా మారిపోయాడు. ఛానెల్స్ మొత్తం కత్తి మహేష్ వెంటపడితే జగన్ చేస్తున్న పాదయాత్ర గురించి పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. దీంతో జగన్ కి ఛానెల్స్ లో కవరేజ్ చూద్దామన్నా కనపడడం లేదు. పరిస్థితులు చూస్తుంటే కత్తి ఎపిసోడ్ మున్ముందు ఇంకా జోరుగా సాగేట్టుంది. అందుకే మెల్లమెల్లగా కత్తి మహేష్ వల్ల జగన్ కి జరుగుతున్న డామేజ్ వైసీపీ శ్రేణులకు అర్ధం అవుతోంది. దీంతో కత్తి అంటే గుస్సా అవుతున్నారు వైసీపీ అభిమానులు. వీళ్ళ ధోరణి చూస్తుంటే నిప్పు పెట్టినంత తేలిక కాదు కార్చిచ్చు ఆపడం అని చెప్పాలి అనిపిస్తోంది.