8 రోజులు…6 గురు ఎమ్మెల్యేలు.

YSRCP 6 MLAs will be joins in TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వైసీపీ అధినేత జగన్ నేడు లండన్ వెళుతున్న విషయం తెలిసిందే. కుమార్తె హర్ష ని లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో చేర్చేందుకు కోర్టు అనుమతి తీసుకున్న జగన్ లండన్ ప్రయాణం పెట్టుకున్నారు. అయితే కుమార్తెకు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ లో సీట్ రావడం ఆనందించదగ్గ విషయం అయినప్పటికీ అంతకు మించిన టెన్షన్ ఆయన్ని కుదిపేస్తోంది. లండన్ టూర్ కి వెళ్లి వచ్చే ఈ 8 రోజుల్లో ఆయనకు హారర్ మూవీ కనిపించడం ఖాయం అనిపిస్తోంది. ఇంతకీ జగన్ ని ఇంతలా టెన్షన్ పెడుతున్న మేటర్ ఏమిటంటే చంద్రబాబు విసురుతున్న ఆపరేషన్ ఆకర్ష్ వల.

నంద్యాల,కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసాక వైసీపీ అధినేత జగన్ కన్నా ఆయన సామర్ధ్యం మీద నమ్మకం పెట్టుకున్న నాయకులు చాలా మందికి భ్రమలు తొలిగిపోయాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా పార్టీ నుంచి బయటపడేందుకు దారులు వెదుక్కుంటున్నారు. ఇప్పటికి 6 గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి సిద్ధమని సీఎం చంద్రబాబుకి రాయబారం కూడా పంపించారట. ఈ విషయం గమనించిన వైసీపీ వారిని బుజ్జగించడానికి తన వల్ల అయినంతవరకు ప్రయత్నం చేసింది. అయితే జగన్ ఇక్కడ లేని 8 రోజుల్లో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుతారన్న భయం జగన్ ని వెంటాడుతోంది. తామెన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగేది ఆపడం సాధ్యం కాదని వైసీపీ కి అర్ధం అయ్యింది. అయితే పరిస్థితి వారు అనుకున్నంత బ్యాడ్ గా లేదట. ఆపరేషన్ ఆకర్ష్ తో ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేల్ని తీసుకోవాలో, వద్దొ ఇంకా నిర్ణయం తీసుకోలేదట.

మరిన్ని వార్తలు:

కట్నంగా విమానం ఇస్తున్న చౌదరి గారు ?

బాబా పిచ్చి కేకల వెనుక సెక్స్ పైత్యం ?

ఎన్టీఆర్ ఎమోషన్ వెనుక పాలిటిక్స్?