ఆ ఏడు సీట్లు బీజేపీ కి …వైసీపీ, జనసేనకు హాఫ్ సెంచరీ.

ysrcp and janasena tension with 2019 elections survey report

ఓ జాతీయ ఛానల్ 2019 లో మళ్లీ బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని ఓ సర్వే విడుదల చేయడం మీద తెలుగు రాష్ట్రాల్లో భారీగా జోకులు పేలుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ ఫలితాలు చూసి చంకలు గుద్దుకోవాల్సిన బీజేపీ నాయకులు కూడా సిగ్గుపడుతున్నారు. ఇంతకీ ఆ సర్వే లో బీజేపీ గెలుస్తాయని చెప్పిన 7 పార్లమెంటరీ స్థానాలు ఎక్కడని చెప్పాలో తెలియక బీజేపీ నేతలు కొందరు మీడియా కి మొహం చాటేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి అలా ఉంటే ఇక పరోక్షంగా ఆ పార్టీకి అంటకాగుతున్న వైసీపీ, జనసేన మింగలేక కక్కలేక నానా అగచాట్లు పడుతున్నాయి. అందుకు కారణం ఏంటో తెలుసా ?

jagan and pawan and modi
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అంటేనే మండిపడుతున్నారని వైసీపీ , జనసేనకు బాగా తెలుసు. అయినా బీజేపీ కి అనుకూలంగా వచ్చిన ఆ జాతీయ సర్వే తప్పు అని పైకి అనలేకపోతున్నారు. అంత కన్నా ఆ రెండు పార్టీలని ఇబ్బంది పెడుతున్న విషయం ఇంకోటి వుంది. బీజేపీ ఖాతాలో సదరు జాతీయ ఛానల్ చెప్పిన 7 లోక్ సభ స్థానాలు తమకి వస్తాయని సర్వే లో వెల్లడి అయినట్టే అని ఆ రెండు పార్టీల బాధ. అదే నిజం అయితే గనుక…అదే లెక్కలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ , జనసేన కలిపి 50 స్థానాలు దక్కించుకుంటాయి. అంటే ఇంకో సారి జగన్ అన్న కాబోయే సీఎం మాత్రమే అవుతాడు. ఇక ఆ కోవలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా చేరిపోతాడు. మొత్తానికి ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలిగినట్టు వుంది వ్యవహారం. ఆంధ్రాలో మోడీకి బూస్ట్ ఇద్దామని చేసిన ప్రయత్నం ఇప్పుడు వైసీపీ ,జనసేన కి టెన్షన్ తెప్పిస్తోంది.

ysrcp and janasena And Bjp