ముస్లింల మీద వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు…!

YSRCP Issues Show Cause Notice To Dr. Gowtham Reddy

గతంలో వంగవీటి రంగా పాములాంటోడు.. ఆయనను చంపితే తప్పేముందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన వైసీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలిచ్చే ఆవును వాడుకుని వదిలేసినట్టు ముస్లింలు తమ భార్యలను వదిలేస్తారని ట్రిపుల్ తలాఖ్‌ పై ఓ టీవీ చానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న గౌతం రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియచేశారు. మామలుగా అయితే వ్యక్తిగత అభిప్రాయం అయ్యేదేమో కానీ ఆ సందర్భంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నారు. గౌతం రెడ్డి మాటలు ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయి. కొన్ని ముస్లిం సంస్థలు., గౌతం రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇస్లాం ధర్మం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వారు విరుచుకుపడ్డారు కూడా.

ముస్లింల ఆగ్రహం పెరుగుతూండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ ఓ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నిజానికి వంగవీటి రంగాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసినప్పుడు టీవీలో ప్రచారమై దుమారం రేగినప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదు. చివరికి కాపులంతా ఎకమవుతారో అని చివరికి సస్పెండ్ చేశారు. కానీ అదంతా ఉత్తుత్తి సస్పెన్షన్ ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ అయితే ఆయనను పార్టీ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ చివరికి. గౌతంరెడ్డిపై తూతూ మంత్రంగా వేసిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి చివరకి రాధాకృష్ణనే పొమ్మనలేక పొగబెట్టారు. గౌతంరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువయిన కారణంగానే వంగవీటి రాంగాపైన, ముస్లింలపైనా వ్యాఖ్యలు చేయడం. అయితే ఆయన వలన పార్టీకి లాభం లేకపోయినా జగన్ ఎందుకు భరిస్తున్నారో మరి !