మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు..తెరపైకి ఏపీ ఎంపీ ?

New angles in the Madapur drug case..AP MP on screen?
New angles in the Madapur drug case..AP MP on screen?

హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో వెంకట్‌ అరెస్టైనట్టు, తన అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. 25 కు పైగా కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారని అధికారులు గుర్తించారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ వసూలు చేశాడట వెంకట్‌.

వెంకటరత్నారెడ్డి నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసాడు… పెళ్లి పేరుతో ఒక ఐఆర్‌ఎస్‌ అధికారిని సైతం మోసం చేశాడట. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేశాడట. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం కూడా చేయించేవాడట. ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను పెళ్లి పేరుతో మోసం చేసిన వెంకట్…ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్…. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టిస్తున్నాడు. వెంకట్‌ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.