గుజరాత్‌ లఖ్తర్ తాలూకాలో బస్సు బోల్తా, 40 మందికి గాయాలు

గుజరాత్‌ లఖ్తర్ తాలూకాలో బస్సు బోల్తా, 40 మందికి గాయాలు
Bus accident

లఖ్తర్ తాలూకా వానా గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి స్టేట్ బస్సు బోల్తా పడటంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేవదర్ నుంచి జునాగఢ్‌కు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది.

బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ మక్వానా మాట్లాడుతూ.. “అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో దేవదర్ నుంచి జునాగఢ్ వెళ్తున్న ఎస్టీ బస్సు వానా గ్రామ సమీపంలో బోల్తా పడింది. బస్సులో ఉన్న 55 నుంచి 60 మంది ప్రయాణికుల్లో 40 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

కాగా, తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం వద్ద ఆదివారం ఉదయం కారు ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చెంగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.