Election Updates: తెలంగాణ సర్వ జనులారా… “తెలంగాణల దొంగలు పడ్డరు”: విజయశాంతి

Election Updates: Telangana all people...
Election Updates: Telangana all people... "Telangana thieves will not fall": Vijayashanti

BRS మేనిఫెస్టో పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలొచ్చాయి కదా… బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మల్ల కనపడుతున్నారని సీఎం కేసీఆర్ పై సెటైర్లు పేల్చారు. గత 9 సంవత్సరాలల్ల ఈ కేసీఆర్ గారి అసత్య వాగ్దానాలను, మోసాలను, దుర్మార్గాలను, దోపిడీ ధోరణులను, ద్రోహాలను రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణవాదులం నిరంతరం ఇప్పటికెల్లి జన సామాన్యానికి తెలియజెయ్యాల్సిన సందర్భం ఇది అన్నారు.

ఈ ముఖ్యమంత్రిగారి కుటుంబం 5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ బిడ్డల నెత్తికి పెట్టి, లక్ష కోట్లకు పైగా పైసలు లూటీ చేసి, మల్లా మరోసారి వాళ్లని నమ్మమంటున్రు అంటూ ఆగ్రహించారు విజయశాంతి. “జాగ్ రెహ్‌నా”… తెలంగాణ సర్వ జనులారా… “తెలంగాణల దొంగలు పడ్డరు” 2014, 2018 ల (టీఆరెస్, కేసీఆర్ అండ్ కో… అనే పేర్లతో) 2023 అట్లా ఉండరాదు ఇప్పుడైనా అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు .