‘ఉస్తాద్‌’లో ప్రభుత్వంపై హరీష్ శంకర్ సెటైర్ల సునామి?

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఇప్పుడు ఎంతటి వివాదాలకు తెర లేపిందో అందరికీ తెలిసిందే.మంత్రి అంబటి రాంబాబు, బ్రో సినిమాలోని శ్యాంబాబు పాత్ర వేసిన స్టెప్పుల మీద మాట్లాడారు. తన మీద ఇలాంటి స్పూపులు ఇంకోసారి చేస్తే బాగుండదని చిత్ర పరిశ్రమకు అంబటి రాంబాబు హెచ్చరించారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ,

బ్రో సినిమా రివ్యూలు, డే వైజ్ కలెక్షన్లను మీడియా ముఖంగా మంత్రి చెప్పడం కూడా ఎంతగా ట్రోల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే బ్రో సినిమాలో చూపించింది కాస్తే కానీ మున్ముందు టన్నులకొద్దీ ఉండబోతోందనే టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాలో బ్రోను మించి, 100 రెట్లకు పైగా ఉంటుందని.

అసలే అది పోలీసోడికి,రాజకీయ నాయకుడు కి మద్య జరిగే కథ . ఆ కథలో కావాల్సినంత AP ప్రభుత్వం మీద,రాజకీయ నాయకులు సెటైర్లు వేసే స్కోప్ ఉంటుంది.దీని మీద ఎన్ని రకాల విమర్శలైనా చేసేందుకు స్క్రిప్ట్స హకరిస్తుంది. అందుకే, పొలిటికల్ సెటైర్ల మీదే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు హరీష్ శంకర్ సైతం క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్‌లో లెక్కకు మించిన సెటైర్లు ఉంటాయని వస్తోన్న ప్రచారంలో ఉంది. అవును ఉంటాయ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఐకానిక్ మ్యానరిజాన్ని షేర్ చేశాడు. అంటే ఉస్తాద్‌ కచ్చితంగా వివాదాల్లో చిక్కుకుంటుందనిపిస్తోంది.

తేరి సినిమాలో దళపతి విజయ్ నటించగా, తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తేరి లైన్‌ను మాత్రమే తీసుకుని ఇక్కడి పరిస్థితులు, రాజకీయ అంశాల చుట్టూ ఈ సినిమా కథనాన్ని అల్లుకుని పూర్తిగా స్క్రిప్ట్‌ను మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.