కాంగ్రెస్ ర్యాలీ మీద యాసిడ్ దాడి…ఆ పార్టీ పనే…!

Acid Attack On Congres Rally
ఈరోజు కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి షాకిస్తూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే తుమకూరులో కాంగ్రెస్ చేస్తున్న విజయోత్సవ ర్యాలీ మీద యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 30 మంది కార్యకర్తలు గాయపడ్డారు.
acid-congrass
స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగి ఉండగా ఈ దాడి చోటుచేసుకుంది. తుమకూరు సిటీ కార్పొరేషన్ 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించగానే కార్యకర్తలు సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఇదే సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై యాసిడ్ దాడికి తెగబడ్డారు. యాసిడ్ దాడిలో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉండొచ్చని కాంగ్రెస్ అనుమానిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
congrass