జీవితతో గొడవ పడి కారు యాక్సిడెంట్‌..!

actor-rajasekhar-car-accident-hyderabad-due-to-depression

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాంగ్రీయంగ్‌మన్‌ రాజశేఖర్‌ ఇటీవల పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవేపై యాక్సిడెంట్‌ చేసిన విషయం తెల్సిందే. యాక్సిడెంట్‌ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. తాగి రాజశేఖర్‌ కారు నడుపుతున్నారు అంటూ మొదట వార్తలు వచ్చాయి. అయితే రాజశేఖర్‌ యాక్సిడెంట్‌ సమయంలో తాగి లేడు అంటూ డ్రంగ్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో తేలింది. పోలీసులు ఆ విషయాన్ని నిర్థారించారు. అయితే తల్లి చనిపోయి కొన్ని రోజులే అవుతున్న నేపథ్యంలో రాజశేఖర్‌ డిప్రెషన్‌లో ఉండి ఉంటాడు. అందుకే ఆ డిప్రెషన్‌లో యాక్సిడెంట్‌ చేసి ఉంటాడని పోలీసులు భావించి ఇద్దరి మద్య రాజీ చేసి పంపించారు.

యాక్సిడెంట్‌ విషయంపై ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం మొదలైంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజశేఖర్‌ తల్లిని కోల్పోవడం వల్ల గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లి పోయారు. ఆయన ఏ పని చేయకపోవడంతో పాటు, సరిగా తినక పోవడంతో యాక్సిడెంట్‌ జరిగిన కొద్ది సమయానికి ముందు జీవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉంటారు, పోయిన వారు ఎలాగూ తిరిగిరారు కదా, మన పను మనం చూసుకోవాలి కదా అంటూ జీవిత ఆగ్రహం వ్యక్తం చేసిందట. దాంతో ఇంట్లోంచి కోపంగా రాజశేఖర్‌ బయటకు వెళ్లాడు.

ఆ సమయంలో ఆయన నిద్ర ట్యాబ్లెట్లు కూడా కొన్ని వేసుకున్నట్లుగా కొందరు అంటున్నారు. ఆ నిద్ర మాత్రలు వేసుకోవడంతో పాటు, తల్లి పోయిన డిప్రెషన్‌, భార్య మరియు కుటుంబ సభ్యులు మందలించారు అనే కోపంతో రాజశేఖర్‌ డ్రైవ్‌ చేసి యాక్సిడెంట్‌ చేశాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఇద్దరి మద్య రాజీ కుదిర్చి కేసు లేకుండా చేశారు. యాక్సిడెంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెళ్లడి కావాలి అంటే రాజశేఖర్‌ నోరు తెరవాల్సిందే. ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేప్పుడు ఏం జరిగిందో ఆయన చెప్పాలి.