మారుతి సినిమాను ముందుకు తెచ్చిన చైతూ

akkineni-naga-chaitanya-next-movie-with-maruti

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యుద్ధం శ‌ర‌ణం డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో యాక్ష‌న్ సినిమాల‌పై నాగ‌చైత‌న్య మ‌రో ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. చూడ‌టానికి క్లాస్ గా, గుడ్ బాయ్ గా క‌న్పించే చైతూకు యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాలు అస్స‌లు సూట్ కావు అని నాగార్జున అభిమానులు ఎప్ప‌టినుంచో మొత్తుకుంటున్నారు. అయినా స‌రే నాగ‌చైత‌న్య ఎక్కువ‌గా ఆ సినిమాలే ఎంచుకుంటూ ఫ్లాప్పులు చూస్తున్నారు. నాగ‌చైత‌న్య భారీ ఆశ‌లు పెట్టుకున్న యుద్ధంశ‌ర‌ణం కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో చైతూ ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది. ముందుగా అనుకున్న‌దాని ప్రకారం యుద్ధం శ‌ర‌ణం త‌రువాత నాగ‌చైత‌న్య చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించాల్సి ఉంది.

ఈ సినిమాకు స‌వ్య‌సాచి అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఒక లైలా కోసం ఫేం పూజ హేగ్ఢేను హీరోయిన్ గా ఖ‌రారు చేశారు. అయితే యుద్ధం శ‌ర‌ణం ఫ‌లితం తిర‌గ‌బ‌డ‌టంతో ఇప్పుడు చందూ మొండేటి స‌వ్య‌సాచిని వాయిదా వేయాల‌ని నాగ‌చైతన్య నిర్ణ‌యించుకున్నాడు. ముందుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లాంటి సినిమా చేసి త‌రువాత స‌వ్య‌సాచిని ప‌ట్టాలెక్కించాల‌ని భావిస్తున్నాడు. మారుతి సినిమా మ‌హానుభావుడు షూటింగ్ పూర్త‌యింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇద్ద‌రి డేట్స ఎడ్జ‌స్ట్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో నాగ‌చైత‌న్య మారుతి సినిమాకే మొద‌ట ప‌చ్చ‌జెండా ఊపారు. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఆయ‌న‌కు కాబోయే భార్య స‌మంత హీరోయిన్ గా న‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?