చెప్పను బ్రదర్‌.. చెప్పొచ్చుగా బ్రదర్‌

allu arjun not responding on pawan kalyan political yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్ని నెలల క్రితం పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడమన్నప్పుడు అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు ‘‘చెప్పను బ్రదర్‌’’. ఈ వాఖ్యం ఏ స్థాయిలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి అల్లు అర్జున్‌ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాజాగా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్రను తెలంగాణ నుండి మొదలు పెట్టాడు. పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంకు పవన్‌ ప్రయత్నాలు చేయలేదు. మొదటి సారి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను కలిసేందుకు పవన్‌ తెలంగాణలో యాత్రను నిర్వహిస్తున్నాడు. తెలంగాణ తర్వాత ఆంధ్రాలో కూడా పవన్‌ యాత్ర కొనసాగబోతుంది. ఈ యాత్రతో రాజకీయ వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో పవన్‌ చర్చనీయాంశం అయ్యాడు.

ఇప్పటికే బాబాయి పవన్‌కు అబ్బాయి రామ్‌ చరణ్‌ జై కొట్టాడు. బాబాయికి ఆల్‌ది బెస్ట్‌ అంటూ జై జనసేన అనేశాడు. ఇక మేగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మరియు మరో అబ్బాయి వరుణ్‌ తేజ్‌లు కూడా పవన్‌కు జిందాబాద్‌ అనేశారు. మెగా హీరోల్లో మరో ముఖ్యుడు అయిన అల్లు అర్జున్‌ మాత్రం ఇప్పటి వరకు పవన్‌ యాత్రకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. మెగా హీరోలు అంతా కూడా పవన్‌ యాత్రకు మద్దతుగా ఆల్‌ ది బెస్ట్‌ చెబితే అల్లు అర్జున్‌ మాత్రం స్పందించక పోవడంతో మెగా ఫ్యాన్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే మళ్లీ చెప్పను బ్రదర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. చెప్పు బ్రదర్‌ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ను ట్యాగ్‌ చేసి కోరుతున్నారు. కాని అల్లు అర్జున్‌ మాత్రం అదేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. నేడు నాపేరు సూర్య చిత్రం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా కూడా పవన్‌ యాత్ర గురించి బన్నీ స్పందించేందుకు నిరాకరించారు.