వారి మీద ఫిర్యాదు చేసిన అమృత…!

Amrutha Pranay Serious On Negative Comments On Social Media

ప్రణయ్ హత్య తర్వాత తన మీదా, ప్రణయ్ కుటుంబ సభ్యుల మీదా కించపరిచేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అమృత పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేసింది. అమృత ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తమను కించపరిచే విధంగా ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయన్న అమృత అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని తాను ఎంతగా ప్రాధేయపడినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని ఆదేదన వ్యక్తం చేసింది.

amrutha-police

పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే పూర్వాపరాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు పేర్కొన్నారు. ఈ విషయమై నేడో రేపో సమగ్ర వివరాలతో కూడిన ఫిర్యాదును అమృత పోలీసులకు అందించనుంది. అదేవిధంగా ప్రణయ్‌ పోస్టుమార్టం రిపోర్టు నకలు పత్రాలు అందించాలని కోరింది.

amrutha-pranay