అసోసియేట్ డైరెక్టర్ కాబోతున్న అనసూయ…!

Anasuya To Turn Associate Director

బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ వెండితెర మీద కూడా నటిగా రాణిస్తున్నారు. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటీవల ‘F2’లో ఓ పాటలో నర్తిహిన ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించిన యాత్ర సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. డు పాటలు మిన‌హా టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుని ఈ ఏడాది వేసవిలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అన‌సూయ మాట్లాడుతూ ‘కథనం’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అయితే ఫస్ట్‌లుక్ చూసిన తరవాత ఈ చిత్రంలో తన పాత్ర ‘క్షణం’లో మాదిరిగానే కనిపిస్తోందని అందరూ అన్నారన్నారు. అయితే ఈ చిత్రంలో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటించడంలేదని క్లారిటీ ఇచ్చారు, తనది ఏడీ (అసోసియేట్ డైరెక్టర్) క్యారెక్టర్ అని చెప్పారు. ఈ సినిమాలో అన‌సూయతో పాటు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టించారు.