ప్ర‌భాస్ నాకు మంచి స్నేహితుడు…అన్న‌య్య అని మాత్రం పిల‌వ‌లేను

anushka comments on prabhas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌భాస్, అనుష్క‌ల గురించి సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. వారిద్ద‌రూ ప్రేమ‌లో మునిగితేలుతున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే ఈ పుకార్ల‌లో నిజం లేదంటోంది అనుష్క‌. ప్ర‌భాస్ త‌నకు మంచి స్నేహితుడు మాత్ర‌మేన‌ని, అంత‌కుమించి త‌మ మ‌ధ్య మ‌రేమీ లేద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే అత‌న్ని అన్న‌య్య అని మాత్రం పిల‌వ‌లేన‌ని, అంద‌రు అబ్బాయిల‌ను అన్న‌య్య‌గా భావించ‌లేం క‌దా అని స్వీటీశెట్టి వ్యాఖ్యానించింది. త‌న పెళ్లి గురించి అనేక వ‌దంతులు వ్యాపింప‌చేస్తున్నార‌ని, స‌రైన వ్య‌క్తి తార‌స‌ప‌డిన‌ప్పుడు పెళ్లిచేసుకుంటాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం త‌న దృష్టంతా న‌ట‌న‌పైనేన‌ని తెలిపింది.

స్టార్ హీరోల రాజ‌కీయ ప్ర‌వేశంపై కూడా త‌న‌ను ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ని, అది వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, తాను మాట్లాడ‌న‌ని ఆమె వ్యాఖ్యానించింది. అనుష్క ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తోన్న భాగ‌మ‌తి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. బాహుబ‌లి 2 త‌ర్వాత అనుష్క న‌టించిన చిత్రం ఇదే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా భాగ‌మ‌తి తెర‌కెక్కింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌ని అనుష్క అంటోంది. ఇందులో తాను సంచ‌ల అనే ఐఏఎస్ అధికారిణిగా న‌టించాన‌ని తెలిపింది. ఓ ఐఏఎస్ అధికారిణి భాగ‌మ‌తిగా ఎలా మారింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌ని తెలిపింది. యూవీ క్రియేష‌న్స్ నిర్మించిన భాగ‌మ‌తికి అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు త‌న‌కు 2012లోనే చెప్పార‌ని, అయితే అప్ప‌టికి తాను లింగా, సైజ్ జీరో, బాహుబ‌లి 1, బాహుబ‌లి 2తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల చేయ‌లేక‌పోయాన‌ని అనుష్క తెలిపింది.