AP Politics: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపు విద్యార్థులకు ట్యాబుల పంపిణీ

AP Politics: Alert for AP students.. Tabs will be distributed to students tomorrow
AP Politics: Alert for AP students.. Tabs will be distributed to students tomorrow

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబులు అందజేస్తారు. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు.

అక్కడి నుంచి చింతపల్లిలోని గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమ పాఠశాల చేరుకొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. ట్యాబులు అందజేసిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

కాగా, ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. నేడు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లు జమ చేయనుంది జగన్ సర్కార్. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ రిలీజ్ చేయనుంది. వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.10.50 లక్షలు ఏపీ ప్రభుత్వం అందించనుంది.