AP Politics: ఈ నెల 28న కుప్పంలో చంద్రబాబు పర్యటన

AP Politics: Chandrababu's visit to Kuppam on 28th of this month
AP Politics: Chandrababu's visit to Kuppam on 28th of this month

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 28న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడ్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు…. ఈ నెల 29, 30 తేదీల్లో నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అరెస్టు తరువాత కుప్పంలో తొలిసారిగా బాబు పర్యటించనున్నారు.

కాగా.. నిన్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావన్నారు. వచ్చే ఎన్నికలు వైసీపీకి ప్రజలకు మధ్య జరిగేవని వివరించారు. నా కోరికంతా తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలనేనని చెప్పారు.

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని ఆపలేదని చెప్పారు. ఏపీలో అమరావతిని ఏం చేశారో చూస్తూనే ఉన్నామని, వి‍శాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు మొట్టి కాయలు వేసిందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు.. ఏదేదో మాట్లాడుతుంది….ఈ ప్రభుత్వ అడ్డగోలు విధానాలపై అన్ని వర్గాల వారు ఆలోచించాలని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక మెట్టు దిగి ముందుకు పోతాం, పార్టీ నేతలు కూడా అదే ఆలోచించాలని కోరారు.