AP Politics: భారాస అధినేత కేసీఆర్ కు సీఎం జగన్ పరామర్శ

AP Politics: CM Jagan's visit to Bharatiya Janata Party (KCR)
AP Politics: CM Jagan's visit to Bharatiya Janata Party (KCR)

భారాస అధినేత కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.