AP Politics: ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో భారత్ బియ్యం

AP Politics: Good news for the people of AP state..India rice soon
AP Politics: Good news for the people of AP state..India rice soon

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ అందింది. కిలో కేవలం రూ. 29కే లభించే భారత్ బియ్యం త్వరలోనే ఏపీకి కూడా రానుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లోనే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని పేర్కొన్నారు. ఎన్సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు.

ఇక అటు రేపు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు.