AP Politics: మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

AP Politics: This is the first list of TDP Assembly candidates..!
AP Politics: This is the first list of TDP Assembly candidates..!

అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని.. వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు.

అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారు. అమరావతి నిర్మాణం ఆపి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారు. అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది. ఆనాడు భాజపాతో విభేదించింది ప్రజల కోసం .. రాష్ట్రం కోసమే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు’’ అని చంద్రబాబు చెప్పారు.