నైజాంలో ‘అరవింద’ హంగామా మామూలుగా లేదు…!

Aravinda Sametha Fake Milestone

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్లు భారీగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారంటున్నారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంభో కాబట్టి ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. సీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటించిన ఎన్టీఆర్‌కు నైజాం ఏరియా నుండి మంచి స్పందన వస్తోంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత నైజాంలో వసూళ్ల రికార్డు ఎన్టీఆర్‌దే. ఈ చిత్రంతో తన రికార్డును తానే బ్రేక్‌ చేసి కొత్త రికార్డులను సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

aravindha-sametha-puja-hudg

నైజాం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 18కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే మొదటి రోజే ఇందులో మూడో వంతు అనగా ఆరుకోట్లను వసూలు చేసి ఉండవచ్చు అని ట్రేడ్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌కు నైజాంలో మంచి పట్టు ఉంది. దాంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉండి అభిమానులు ‘అరవింద సమేత’ను వీక్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. దాంతో నైజాం ఏరియాలో తొలి రోజే ఆరు కోట్లదాకా వసూలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అధికారిక రిపోర్ట్‌ రాలేదు కానీ దాదాపు ఆరుకోట్లను ఈజీగా రాబడుతుందని అంచనా. మొత్తానికి సీమరెడ్డిగా ఎన్టీఆర్‌ స్టామినా నైజాంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కలెక్షన్ల పరంగా నైజాంలో ‘అరవింద’ హంగామా మామూలుగా లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

nizam