‘గుంటూరు కారం’లో వారిద్దరు సిస్టర్స్ అట ?

Superstar Mahesh Babu
Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇద్దరు సిస్టర్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది ..

కాకపోతే ఇద్దరికీ తండ్రి ఒకరు అయినా, తల్లులు మాత్రం వేరు అని, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. ముఖ్యంగా వీరిద్దరి మధ్య మహేష్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

అంతేకాదు . గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ కథ కూడా నడుస్తోందని.. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందని టాక్. వినిపిస్తుంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ తీశుకొచ్చారు అని అంటున్నారు . ఫాన్స్ ఇది ఇలాఉండగా ఇంకా ఈ సినిమా కథని ఒక రేంజులో ప్లాన్ చేశాడట.

పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారిగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.