అర్జున్‌ రెడ్డిని ఇంకా పెంచుతారట!

Arjun Reddy movie team want to increase run show time 15 minutes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్‌లుగా సందీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. గత కొంత కాలంగా తెలుగు సినిమాల నిడివి రెండున్నర గంటలు దాటడం లేదు. ఒకవేళ దాటినా ఫలితం అటు ఇటు అవ్వడం ఖాయం అని పు ప్రయోగాలు చెప్పకనే చెప్పాయి. కాని ‘అర్జున్‌ రెడ్డి’ ఏకంగా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు గంటల సినిమాను ప్రేక్షకులు ఎలా భరిస్తారు, నిడివి సినిమాకు మైనస్‌ అవుతుందని అంతా భావించారు. కాని మూడు గంటలు కూడా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

నిడివి అనేది అర్జున్‌ రెడ్డికి మైనస్‌ కాలేదు. కొందరు సెకండ్‌ హాఫ్‌ కాస్త స్లో ఉందని అన్నా కూడా మొత్తంగా బాగుందనే చెబుతున్నారు. ఇక్కడ వరకు సరే బాగానే ఉంది. కాని ఇప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల వారికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఇప్పటికే మూడు గంటల నిడివి ఉన్న సినిమాను మరో 15 నిమిషాల పాటు పెంచుతామని చెబుతున్నారు. కొన్ని కీలక సన్నివేశాలను యాడ్‌ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు గంటలున్న సినిమాను పెంచడం సాహస నిర్ణయం. ఇలాంటి సాహస నిర్ణయం చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా 15 నిమిషాలు యాడ్‌ చేయాలని భావించినప్పుడు ఇప్పటికే ఉన్న కొంత స్టఫ్‌ను తొలగించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు:

బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ

చంద్ర‌బాబుపై చెద‌ర‌ని న‌మ్మ‌కం