దేశానికి వాళ్ళే ప్ర‌ధాని కావాలి…మోడీపై కేజ్రీవాల్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు

Kejriwal says educated people can deserve for PM of India

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌ధాన‌మంత్రి మోడీని ఉద్దేశించి ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాని మోడీ డిగ్రీ న‌క‌లీదంటూ గ‌తంలో ఆరోపించిన కేజ్రీవాల్ తాజాగానూ మోడీ… చ‌దువుకున్న వ్య‌క్తి కాద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. మోడీకి చ‌దువులేదని ఆరోపించే క్ర‌మంలో కేజ్రీవాల్ ఒకప్పుడు తాను తిట్టిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ను ఎంత‌గానో పొగిడారు.

రూపాయి ప‌త‌నం దేశీయ పెట్టుబ‌డుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే అంశంపై ఓ ఆంగ్ల‌మీడియా రాసిన క‌థ‌నాన్ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్ డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి విద్యావంతుడైన ప్ర‌ధానిని దేశ‌ ప్ర‌జ‌లు కోల్పోయార‌ని, ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి ప్ర‌ధానిని కోరుకుంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ ప్ర‌ధాన‌మంత్రి క‌చ్చితంగా విద్యావంతుడై ఉండాలి అని ట్వీట్ చేశారు. అయితే ప్ర‌ధానిని తిడుతూ, మాజీ ప్ర‌ధానిని పొగుడుతున్న కేజ్రీవాల్ పై కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేజ్రీవాల్ అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ను ధృత‌రాష్ట్రుడితో పోల్చ‌డాన్ని గుర్తుచేస్తున్నారు.