ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఏషియన్ గ్రూప్ బ్రదర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఏషియన్ గ్రూప్ బ్రదర్స్
Cinema News

టాలీవుడ్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక పుష్ప 1 సినిమా ఇటీవల రిలీజ్ తరువాత మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు టైటిల్ రోల్ లో అల్లు అర్జున్ కనబరిచిన అద్భుత నటనకు అందరి నుండి గొప్ప ప్రశంసలు కురిసాయి .

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఏషియన్ గ్రూప్ బ్రదర్స్
Pushpa 2 The Rule

ఇక ఇటీవల పుష్పలో సూపర్ యాక్టింగ్ కి గాను ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు అల్లు అర్జున్. నిన్న ఢిల్లీ లో గ్రాండ్ గా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ని అందుకోవడం జరిగింది. దానితో నిన్నటి నుండి అల్లు అర్జున్ కి పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తుండగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరుగా కొనసాగుతున్న ఏషియన్ సంస్థల అధినేతలు ఏషియన్ సునీల్, భరత్ ఇద్దరూ ఆయనని ప్రత్యేకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా అల్లు అర్జున్ ని ఏషియన్ గ్రూప్ బ్రదర్స్ కలిసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.