‘సింహా’, ‘లెజెండ్‌’.. ఇప్పుడు ‘జైసింహా’

balakrishna about fans expectations on jai simha movie
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు ఏ రేంజ్‌ విజయాలను దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు సినిమాలు బాలయ్య కెరీర్‌లో నిలిచి పోయే చిత్రాలు. ఆ రెండు చిత్రాల తర్వాత ఆ స్థాయి విజయాలు బాలయ్యకు దక్కలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా మాస్‌ ఆడియన్స్‌కు, నందమూరి ఫ్యాన్స్‌కు సరైన కిక్‌ను ఇవ్వలేక పోయింది. మళ్లీ ‘సింహా’, ‘లెజెండ్‌’ రేంజ్‌ సక్సెస్‌ కోసం బాలయ్య ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు ‘జైసింహా’తో బ్రేక్‌ పడే అవకాశం ఉందని అనిపిస్తుంది.

తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ‘జై సింహా’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అని ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌లను చూస్తుంటే అనిపిస్తుంది. పైగా సింహా, లెజెండ్‌ తరహాలోనే ఈ చిత్రంలో కూడా బాలయ్య ద్వి పాత్రాభినయం చేశాడు. ఇక నయనతార హీరోయిన్‌ అవ్వడం వల్ల కూడా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. బాలకృష్ణ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నాడు. తన నుండి ఫ్యాన్స్‌ ఎలాంటి సినిమాను ఎదురు చూస్తున్నరనే విషయం తనకు తెలుసు అని, అలాంటి సినిమానే ఇది అని, తప్పకుండా ఫ్యాన్స్‌ తలెత్తుకునేలా ఉంటుందని బాలయ్య చెబుతున్నాడు. జైసింహా సక్సెస్‌తో బాలయ్య సరికొత్త రికార్డులను సృష్టిస్తాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.