బాలయ్య ఎవరి మాటా వినడం లేదు.. వచ్చే నెలలో షురూ

S V krishna Reddy Direct balakrishna 103 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ 100 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మరింత జోరుగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. తన 101వ చిత్రం పైసా వసూళ్‌ విడుదల చేసి మూడు నాలుగు నెలలు కాకుండానే అప్పుడే సంక్రాంతికి తన 102వ చిత్రం ‘జై సింహా’ను విడుదల చేయబోతున్నాడు. జై సింహా విడుదల కాకుండానే 103వ చిత్రాన్ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. బాలయ్య 103వ సినిమాకు తాజాగా దర్శకుడు ఖరారు అయ్యాడు. అప్పట్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.

బాలయ్య 101వ చిత్రంగానే ఎస్వీకృష్ణారెడ్డి చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కాని పూరి జగన్నాధ్‌ ఒక మంచి కథ తెచ్చాడు అంటూ పైసా వసూల్‌ చిత్రాన్ని చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా వద్దు అంటూ బాలయ్య ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు మరియు శ్రేయోభిలాషులు కూడా బాలయ్యను హెచ్చరిస్తున్నారు. కాని బాలకృష్ణ మాత్రం తాను అనుకున్న విధంగా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా తీయాలని పట్టుబడుతున్నాడు. బాలయ్యకు ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ కారణంగానే బాలయ్య ఎప్పుడెప్పుడు ఆ కథతో సినిమా చేయాలా అని పట్టుదతో ఉన్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఆ చిత్రం ఉండబోతుందని సమాచారం అందుతుంది. పట్టుదలతో బాలయ్య చేయబోతున్న ఆ సినిమా సక్సెస్‌ను దక్కించుకుంటుందా లేదా నిరాశను మిగుల్చుతుందా అనేది చూడాలి.