Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్నహీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. మహానటిలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సావిత్రిగా నటిస్తున్న కీర్తి సురేశ్ కు తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అజ్ఞాతవాసి నిరాశపరిచినప్పటికీ..కీర్తి సురేశ్ పై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. తాజాగా మరో భారీ సినిమా ఛాన్స్ దక్కించుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా క్రీడానేపథ్యంతో ఓంకార్ తెరకెక్కిస్తోన్న సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించనుంది.
తొలినుంచీ తన సరసన స్టార్ హీరోయిన్లనే ఎంచుకుంటున్న శ్రీనివాస్ తాజా సినిమాలోనూ పేరున్న నాయకికే మొగ్గుచూపాడు. ఈ సినిమాకు గాను కీర్తి సురేశ్ రూ. కోటీ 25లక్షలు పారితోషకం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న కీర్తి సురేశ్ తమ సినిమాకు బాగా సూటవుతుందని డైరెక్టర్, హీరో భావిస్తున్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ ఎక్కువయినప్పటికీ స్టార్ హీరోయిన్ ఉంటే..సినిమా మార్కెట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కీర్తి సురేశ్ ను సంప్రదించారు. జయజయ జానకిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఆడిపాడిన శ్రీనివాస్, ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. మహానటి తర్వాత కీర్తిసురేశ్ అల్లుడు శీనుతో కలిసి చిందులేయనుంది.