BREAKING: బోడే ప్రసాద్ కు సీటు కేటాయించిన టీడీపీ అధిష్టానం

BREAKING: Bode Prasad has been allotted a seat by the TDP chief
BREAKING: Bode Prasad has been allotted a seat by the TDP chief

విజయవాడ లోని పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు బోడే ప్రసాద్ కు సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. తొలుత బోడే కు సీటు ఇవ్వలేమని చెప్పిన అధిష్టానం..ఇప్పుడు ప్రకటించింది. టికెట్‌ ఇవ్వబోమని టీడీపీ చెప్పడంతో… స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతానని చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేశారు బోడే.

పెనమలూరు సీటు కోసం అనేక పేర్లు పరిశీలించింది టీడీపీ అధిష్టానం. కానీ చివరికీ బోడే ప్రసాద్ కు సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ… చంద్రబాబుకి, పెనమ లూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పెనమలూరు సీటు భారీ మెజార్టీ తో గెలిచి చంద్రబాబుకి బహుమానంగా ఇస్తానని వెల్లడించారు. మూడో సారి సీటు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు బోడే ప్రసాద్.