BREAKING NEWS : తిరుపతిలో ఐటీ దాడుల కలకలం..!

BREAKING NEWS : The chaos of IT attacks in Tirupati..!
BREAKING NEWS : The chaos of IT attacks in Tirupati..!

తిరుపతిలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.. డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సి దివాకర్ రెడ్డి.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం తో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం రోడ్డులోని పురంధర కాంప్లెక్స్ లోని డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో ఫైల్ లను పరిశీలిస్తున్న అధికారులు. ఏకకాలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి కార్యాలయంతో పాటు ఇంట్లో, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

డాలర్స్ దివాకర్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతీ పత్రాలను పరిశీలిస్తున్నారు.. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు.. కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపిన విషయం విదితమే.. మహేశ్వరం టికెట్‌ ఆశిస్తున్న బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాతా నరసింహారెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డికి సంబంధిచిన ఇల్లు, కార్యాలయాల్లో.. అదే విధంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే.