Breaking News: ప్రజా భవన్ లో వైఎస్‌ షర్మిల.. ఎందుకో మరి..?

AP Politics: Sharmila's Big Shock for Jagan
AP Politics: Sharmila's Big Shock for Jagan

Breaking News: ప్రజా భవన్ కు వెళ్లారు వైఎస్‌ షర్మిల. ప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ప్రజాభవన్ లో వైఎస్‌ షర్మిల కలిసారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ప్రజాభవన్ లో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి కుమారుడి పెండ్లీ కార్డు అందజేశారు కాంగ్రెస్ నేత షర్మిలమ్మ.

ఈ నెల 18న నా తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదిన జరిగే పెండ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు . అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.

భట్టి అన్నా బాగున్నారా కంగ్రాట్యులేషన్ మీరు డిప్యూటీ సీఎం కావడం నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తెలిపారు. భట్టి అన్న నా కొడుకు పెళ్ళికి రండి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి వివాహ పత్రికను కాంగ్రెస్ నేత షర్మిలమ్మ అందజేశారు.