Breaking: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లను దారుణంగా కొట్టిన వైసీపీ నేతలు. !

Breaking: YCP leaders brutally beat RTC driver and conductor. !
Breaking: YCP leaders brutally beat RTC driver and conductor. !

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి జరిగింది. విజయవాడ డిపో నకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తోంది. అయితే కావలిలోని ట్రంకు రోడ్డు లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్ తన ముందున్న కారు అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి… బస్సు డ్రైవర్ తో వాదనకు దిగాడు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.

అంతటితో అందరూ ఈ వివాదం సమసిపోయిందని భావించారు. కానీ ఈ విషయాన్ని ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి తన మిత్రులతో చెప్పి… 14 మంది ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఆ తర్వాత.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను దారుణంగా కొట్టారు. అయితే.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను దారుణంగా కొట్టిన వారిలో కావలి వైసీపీ నేతలు శివరెడ్డి, విల్సన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తన కారుకు దారివ్వలేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను కావలి వైసీపీ నేతలు శివరెడ్డి, విల్సన్ దారుణంగా కొట్టినట్లు అందరూ అనుకుంటున్నారు.