దర్శకుడికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

Bunny Vas Gift to Parasuram

‘గీత గోవిందం’ చిత్రం తర్వాత దర్శకుడు పరుశురామ్‌ ఒక్కసారిగా టాప్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టడంతో దర్శకుడు పరుశురామ్‌తో సినిమాలు చేసేందుకు పలువురు యువ హీరోలు మరియు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకుడు పరుశురామ్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పరుశురామ్‌ తదుపరి చిత్రం మళ్లీ గీతాఆర్ట్స్‌ 2లోనే అని తేలిపోయింది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేదా సాయి ధరమ్‌ తేజ్‌తో పరుశురామ్‌ మూవీని నిర్మించేందుకు బన్నీ వాసు ప్రయత్నాలు చేస్తున్నాడు. పరుశురామ్‌ మళ్లీ తమ బ్యానర్‌లోనే చేసేలా బన్నీ వాసు ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Bunny Vas

పరుశురామ్‌కు చాలా ఖరీదైన ఒక ప్లాట్‌ను నిర్మాత బన్నీ వాసు ఇచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తదుపరి చిత్రంకు అడ్వాన్స్‌గా ఆ ఫ్లాట్‌ను ఇచ్చినట్లుగా కొందరు అంటుండగా, మరికొందరు గీత గోవిందం చిత్రంకు భారీ ఎత్తున వసూళ్లు వస్తున్న కారణంగా దర్శకుడికి గిఫ్ట్‌ అంటూ మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా దర్శకుడు పరుశురామ్‌కు ఖరీదైన ప్లాట్‌ను నిర్మాత బన్నీ వాసు ఇవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. నిర్మాత బన్నీ వాసు కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి చిత్రాలను నిర్మిస్తున్నాడు అంటూ స్వయంగా అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌ సారథ్యంలో బన్నీ వాసు వరుసగా మంచి విజయాలను దక్కించుకుంటున్నాడు.

director  Parasuram