కళ్యాణ్‌ ఏమాత్రం తగ్గట్లేదుగా..!

Balakrishna and Anil Ravipudi Combo movie in C Kalyan Production

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి బాలకృష్ణతో ‘జైసింహా’ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్న నిర్మాత సి కళ్యాణ్‌ తాజాగా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, వినాయక్‌ల కాంబినేషన్‌లో ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని నిర్మించి మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలతో దాదాపు 35 కోట్ల మేరకు నష్టపోయినట్లుగా సమాచారం అందుతుంది. అనధికారిక లెక్కల ప్రకారం అంతకు మించే సి కళ్యాణ్‌ నష్టపోయి ఉంటాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక నిర్మాత అంత భారీగా నష్టపోతే తర్వాత సినిమాకు కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది. కాని సి కళ్యాణ్‌ మాత్రం ఏమాత్రం గ్యాప్‌ లేకుండా మరో సినిమాను, అది కూడా భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.

‘జైసింహా’ చిత్రం సమయంలోనే బాలకృష్ణతో మరో సినిమాను నిర్మించేందుకు సి కళ్యాణ్‌ ఒప్పందం చేసుకున్నాడు. మంచి కథతో వస్తే తప్పకుండా 2018 చివర్లో డేట్లు ఇస్తాను అంటూ బాలయ్య హామీ ఇవ్వడంతో సి కళ్యాణ్‌ పలువురు దర్శకులతో సంప్రదింపులు జరిపాడు. వినాయక్‌ దర్శకత్వంలో బాలయ్య హీరోగా సినిమాను నిర్మించాలని కళ్యాణ్‌ మొదట భావించాడు. అయితే వినాయక్‌ ప్రస్తుతానికి బాలయ్యతో సినిమా చేయను అని చెప్పడంతో అనీల్‌ రావిపూడితో నిర్మాత కళ్యాణ్‌ చర్చలు జరిపాడని, గతంలోనే బాలయ్యకు అనీల్‌ రావిపూడి ఒక కథ వినిపించాడని, అదే స్టోరీతో ఇప్పుడు బాలయ్య, అనీల్‌ రావిపూడిలతో కళ్యాణ్‌ నిర్మించబోతున్నాడు. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నాడట. రాజా ది గ్రేట్‌ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనీల్‌రావి పూడి బాలయ్యకు విజయాన్ని ఇస్తాడేమో చూడాలి.