‘రంగస్థలం’ కొన్ని సీన్స్‌ రీ షూట్‌ చేయమన్న చిరు.. అక్కర్లేదన్న చరణ్‌

charan convince chiru over sukumar about rangasthalam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఒక పాట మరియు కొన్ని సీన్స్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా సినిమా అంతా పూర్తి అయ్యింది. ఇటీవల సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ రషెష్‌ను మెగాస్టార్‌ చిరంజీవి చూశాడని, అందులో కొన్ని సీన్స్‌పై చిరంజీవి పెదవి విరిచాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సీన్స్‌ను రీ షూట్‌ చేస్తే బాగుంటుందని, సినిమా విడుదలకు సమయం ఉంది కనుక రీ షూట్‌ చేయాలంటూ దర్శకుడు సుకుమార్‌కు చిరంజీవి సలహా ఇచ్చాడని తెలుస్తోంది.

చిరంజీవి సలహా మేరకు సుకుమార్‌ రీ షూట్‌కు ప్లాన్‌ చేయాలని భావించాడు. పూర్తి నమ్మకంగా ఆ సీన్స్‌ను చేసిన దర్శకుడు సుకుమార్‌ రీ షూట్‌కు చిరంజీవి ఆదేశించడంతో చేసేది లేక రీ షూట్‌ ప్లాన్‌ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలోనే చరణ్‌ రీ షూట్‌ అక్కర్లేదని, తాను డాడీతో మాట్లాడుతాను అంటూ సుకుమార్‌కు చెప్పడం జరిగింది. సుకుమార్‌ ఏం చేసినా కూడా మంచి ఫలితం వస్తుందని, ఆయన ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచుదామని, రీ షూట్‌ అక్కర్లేదని, ఆయన అనుకున్నట్లుగానే సినిమాను చేయనిద్దామని, ఆయన అనుకున్నట్లుగా సినిమా ఔట్‌ పుట్‌ వచ్చేలా చూద్దామని చరణ్‌ కన్విన్సింగ్‌గా చిరంజీవికి చెప్పడంతో ఆయన సరే అన్నట్లుగా తెలుస్తోంది. చరణ్‌ తనపై పెట్టుకున్న నమ్మకంను ఒమ్ము కాకుండా ‘రంగస్థలం’ చిత్రాన్ని సక్సెస్‌ చేయాలని దర్శకుడు సుకుమార్‌ చాలా సీరియస్‌గా ఉన్నాడు.