అజ్ఞాతవాసికి చిరంజీవి గెస్ట్‌… ఇది నిజం!

Chiranjeevi as Chief Guest for Pawan Kalyan Agnathavasi Movie audio Launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా స్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు కలిసి ఒకే స్టేజ్‌పై ఉండాలని మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. వారి కోరిక పలు సార్లు నెరవేరినా కూడా మళ్లీ మళ్లీ అదే కోరుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి పవన్‌ మరియు చిరంజీవి ఒకే స్టేజ్‌పై కలవాలని కోరుకుంటున్నారు. పవన్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో విడుదల వేడుకలో చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంను కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆ చిత్రం షూటింగ్‌ మద్యలో ఆడియో విడుదల వేడుకకు హాజరు అవ్వడం కష్టమే అంటున్నారు.

pawan-kalyan-agnathavasi-au

చిరంజీవి, పవన్‌ల మద్య గత కొంత కాలంగా అన్యోన్యత కనిపిస్తుంది. ఇద్దరు కూడా చాలా సందర్బాల్లో కలిశారు, కలుస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసినట్లుగా సమాచారం అందుతుంది. ఇది పవన్‌కు 25వ చిత్రం అవ్వడం వల్ల ఆడియో వేడుకను ప్రత్యేకంగా చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. అందుకే పవన్‌తో ఇప్పటి వరకు పని చేసిన దర్శకులు అందరిని కూడా ఈ వేడుకకు హాజరు పర్చాలని నిర్ణయించారు. ఇక ఆడియో విడుదలను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించడం వల్ల ప్రేక్షకుల్లో మరియు ఫ్యాన్స్‌లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉందని, తప్పకుండా చిరంజీవి చేతుల మీదుగా ఆడియో విడుదల అయితే సినిమాకు ఉపయోగం అనే ఉద్దేశ్యంతో దర్శక నిర్మాతలు చిరంజీవిని ఒప్పించే పనిలో పడ్డారు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో నిజం ఎంత, అబద్దమా అంటూ సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.