బీజేపీ అంటే కేసీఆర్ కు భయమా..?

The BJP is afraid of KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉద్యమ పార్టీగా అందర్నీ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని అధినేత కేసీఆర్. కానీ ఆయన్ను ఢిల్లీలో ప్రధాని మోడీ ఆడుకుంటున్నారట. అందుకే ప్రధానికి చిక్కకుండా ఉండటానికి కేసీఆర్ ఆయన ఏం స్కీమ్ తీసుకొచ్చినా చెక్క భజన చేస్తూ.. బీజేపీ నేతలను మించిపోతున్నారట. ఈ మాటలు ఎవరో అనలేదు. టీకాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కేసీఆర్.. అతిగా మోడీ భజన చేస్తున్నారని. గతంలో కేసీఆర్ సోనియాకు వెన్నుపోటు పొడిచినట్లే మోడీకి పొడుస్తారని కాంగ్రెస్ నేతలంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే.. అప్పనంగా సీఎం అయిపోయిన కేసీఆర్.. కనీసం కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ కు ఎందుకు మద్దతివ్వడం లేదని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. అదేమంటే దళితుడి పేరుతో రామ్ నాథ్ కోవింద్ సాకు చెబుతున్నారని వారంటున్నారు. కేసీఆర్ విశ్వాసఘాతకుడని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడ్ని చేస్తానని ప్రచారం చేసి, చివరకు తానే పదవిలో కూర్చున్నారని, తెలంగాణ ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో.. దళిత రాష్ట్రపతి అంటూ నాటక మాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ వచ్చాక రాజకీయ సన్యాసానికి రెడీ. దళితుడ్ని సీఎం చేయకపోతే తల నరుక్కుంటా. తెలంగాణ ఇస్తే చాలు ఏం చేయడానికైనా సిద్ధం. అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు మోడీ అడుగులకు మడుగులొత్తుతున్నాడంటున్నారు కాంగ్రెస్ నేతలు. పైగా కేసీఆర్ గత కుంభకోణాల లిస్ట్ అంతా మోడీ దగ్గర ఉందని, అందుకే నోర్మూసుకుని ఉన్నారని చెబుతున్నారు హస్తం నేతలు.

మరిన్ని వార్తలు