Crime: అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం

Crime: Murdered their daughters last month... committed suicide today
Crime: Murdered their daughters last month... committed suicide today

అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న భాస్కర్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తె, కుమారుడికి బిర్యానీలో విషం కలిపి తినిపించాడు. అనంతరం తానూ తిన్నాడు. ఇంట్లోని వారంతా వాంతులు చేసుకోవడంతో గుర్తించిన స్థానికులు.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.