Crime: తండ్రిపై పగ.. ప్రతీకారంగా కొడుకు హత్య

Crime: A man who ran away with a married woman was beaten and made to drink urine
Crime: A man who ran away with a married woman was beaten and made to drink urine

తమ కుటుంబంతో తరచూ గొడవపడుతున్న వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు ఓ యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిని కిరాతకంగా చంపాడు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం .. ఉసిరీబెడా గ్రామానికి చెందిన గౌతమ్వర్మకు మొబైల్ దుకాణం ఉంది. అదే గ్రామవాసి అయిన నిందితుడు నీతీశ్ కుశ్వాహా (19) కుటుంబానికి, గౌతమ్వర్మకు చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ వివాదాల కారణంగా గౌతమ్వర్మపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించిన నీతీశ్.. గౌతమ్ కుమారుడు వేద్వర్మను కిడ్నాప్ చేశాడు. మరో స్నేహితుడితో కలిసి బైకుపై జగదల్పుర్ సమీపంలో ఉన్న అడవిలోకి బాలుణ్ని తీసుకువెళ్లాడు.

ముందు తాడుతో గొంతు నుమిలి, తర్వాత కత్తితో గొంతు కోసి చిన్నారిని హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇద్దరూ పారిపోయారు. బాలుడు కనిపించడం లేదన్న గౌతమ్వర్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చివరిసారిగా నిందితుడు నీతీశ్తో బాలుడు కనిపించాడని తెలిసింది. దీంతో నితీశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నీతీశ్ డ్రగ్స్ బానిస అని, చిన్నారికి ఇచ్చిన చాక్లెట్లోనూ మత్తు పదార్థాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడి స్నేహితుణ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.