Crime: తెనాలిలో దారుణం.. వివాహిత హత్య

Crime: Atrocious in Tenali.. Murder of a married woman
Crime: Atrocious in Tenali.. Murder of a married woman

గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మ పేటలో వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానిక భవనం వారి వీధిలో నివాసముంటున్న రామిశెట్టి అలేఖ్యను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. గురువారం ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడిఉన్న అలేఖ్య మృతదేహాన్ని గుర్తించిన ఆమె భర్త రమేశ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న టూటౌన్ పోలీసులు వివరాలు సేకరించారు.

గత కొన్నేళ్లుగా అన్నెం శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని.. కేసులు కూడా పెట్టామని మృతురాలి భర్త రమేశ్ పోలీసులకు తెలిపారు. ‘‘నా భార్యను శ్రీనివాస్ తరచూ వేధించేవాడు. ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడు. మమ్మల్ని చంపుతామని పలుమార్లు బెదిరించాడు. అతడిపై కేసులు పెట్టాం. శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఇలా చేశాడు. బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం.. కానీ, ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదు’’ అని రమేశ్ పోలీసులకు వివరించాడు.

గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో గొంతు కోయడంతోనే తీవ్ర గాయమై అలేఖ్య చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని సీఐ సుధాకర్ తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఇలా చేసినట్లు తెలుస్తోందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు.