Crime: ఆర్టీసీ కార్గో బస్సులో తరలిస్తున్న రూ.22.59 లక్షల నగదు స్వాధీనం

Crime: Rs.22.59 lakh cash seized in RTC cargo bus
Crime: Rs.22.59 lakh cash seized in RTC cargo bus

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం తనిఖీలు చేపట్టిన అధికారులు ఆర్టీసీ కార్గో బస్సులో తరలిస్తున్న రూ.22.59 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యాపారులు చంటి, రాజు, ప్రకాశ్ పేరుతో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గో ద్వారా 5 టన్నుల బరువున్న సామగ్రిని శనివారం రాత్రి పంపించారు.

అందులో 507 బకెట్లు, ఇనుప వస్తువులు, ఒక సంచి, మరికొన్ని ఆర్టీసీ కార్గో …వస్తువులు ఉన్నాయి. ఒక బకెట్లో దాచిన రూ.22.59 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి కె.వి.రమణ గుర్తించారు. ఎలాంటి ఆధారాలు, రశీదులు లేకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సహాయ ఎన్నికల అధికారి స్లీవ జోజి తెలిపారు.