Crime: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పీఏ ఆత్మహత్య

Crime: Srikalahasti MLA Madhusudan Reddy PA suicide
Crime: Srikalahasti MLA Madhusudan Reddy PA suicide

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న రవి.. ఎమ్మెల్యే తరఫున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే ఉన్నట్టుండి రవి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలే ఆత్మ హత్యకు కారణాలుగా అనుమానిస్తున్నారు.