AP Politics: పట్టు వీడని వాలంటీర్లు.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె..!

AP Politics: Volunteers who will not let go.. strike across the state..!
AP Politics: Volunteers who will not let go.. strike across the state..!

గౌరవ వేతనాన్ని రూ.18 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అధికారులు, వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు, ఒత్తిడి చేసినా బుధవారం కూడా ఆడుదాం ఆంధ్రాకు వీరు హాజరు కాలేదు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలాల్లో వాలంటీర్లు యథావిధిగా సమ్మెలో పాల్గొన్నారు. సీఎం జగన్ ఇలాకా వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీఓ
కార్యాలయానికి వచ్చిన సంయుక్త కలెక్టర్ గణేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో ఆరుగురు వాలంటీర్లు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి హాజరు కావడం పై మిగతా వాలంటీర్లు మండిపడ్డారు.