Crime: తెలంగాణలో విషాదం.. MBA విద్యార్థిని ఆత్మహత్య

Crime: Tragedy in Telangana.. MBA student commits suicide
Crime: Tragedy in Telangana.. MBA student commits suicide

తెలంగాణ మరో విషాదం చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రయివేటు ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న సాహితి అనే యువతి మరణించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న ములుగు జిల్లాకు చెందిన సాహితీ(26) హాస్టల్‌ రూమ్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

దీంతో యువతి మృతిపై చైతన్య పురి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని… పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అటు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.