Crime: యూసఫ్ గూడలో విషాదం.. తల్లి, పిల్లలు అదృశ్యం

Crime: Tragedy in Yusuf Guda.. Mother and children disappear
Crime: Tragedy in Yusuf Guda.. Mother and children disappear

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… ఎస్పీ ఆర్ హిల్స్ ఓం నగర్ ప్రాంతంలో నివాసముండే లత(26)కు ఇద్దరు పిల్లలు అక్షిత(7), నిహారిక(5). పిల్లల ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో తాయిత్తు కట్టించుకుని వస్తానని బుధవారం ఉదయం తల్లి విజయకు చెప్పి వెళ్లింది. ఆమె 11 గంటల ప్రాంతంలో ఫోన్చేస్తే 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని లత తెలిపింది. విజయ మళ్లీ 11:20 గంటలకు ఫోన్ చేస్తే తన భర్త నాగరాజు రోజూ తాగుతూ పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నానని లత ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. లత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.