యదార్ధ ఘటన ఆధారంగా ” దేవర” స్టోరీ..?

Junior NTR
Junior NTR

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన నెక్ట్స్ మూవీ ‘దేవర’ స్టోరీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. స్క్రిప్ట్ పక్కాగా కుదిరేంత వరకు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు తారక్. ఇక దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ మూవీతో డిజాస్టర్ ఎదుర్కోవడంతో ప్రీప్రొడక్షన్ స్టేజ్‌లోనే కథపై మరింత ఫోకస్ చేసి పకడ్బందీగా తయారు చేసుకున్నారు.

అలాగే కాస్టింగ్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మేరకు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను కథానాయికగా .. స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. చక చకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ‘దేవర’ చిత్ర కథను కొన్ని యదార్ధ సంఘటన ఆధారంగా రాసుకున్నారట కొరటాల శివ. ఆ సంఘటనలు మరేవో కాదు..

‘దేవర’ చిత్రాన్ని గతంలో దళితులపై జరిగిన క్రూరమైన హత్యాకాండ ఆధారంగా రూపొందింస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నారని సమాచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ యదార్ధ ఘటన ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం చేస్తూ వచ్చారు. ‘మిర్చి’ సినిమాలో ఫ్యాక్షన్ గొడవలను, ‘శ్రీమంతుడు’ చిత్రంలో విలేజ్ అడాప్టేషన్, ‘భరత్ అనే నేను’ మూవీలో రాజకీయాల్లో జవాబుదారీతనం, ‘ఆచార్య’లో నక్సలైట్ ఉద్యమాన్ని చూపించారు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ కథలో కారంచేడు విషాద ఘటన తాలూకు సన్నివేశాలు ఉండవచ్చని సినీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ లు సంయుక్తంగా ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి టాప్ మోస్ట్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా , రత్నవేలు కెమెరామ్యాన్‌గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు హై వోల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.