మారుతి కొత్తగా ట్రై చేయాలి…!

Director Maruthi Ready To Mass Entertainment Movies

చిన్న చిత్రాల దర్శకుడిగా, బూతు చిత్రాల దర్శకుడిగా ముద్ర పడ్డ మారుతి అతి తక్కువ సమయంలోనే మంచి దర్శకుడిగా, పెద్ద చిత్రాల దర్శకుడిగా మారుతి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు చిత్రాలతో మంచి విజయాలను దక్కించుకున్నాడు. తాజాగా శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని కూడా అదే జోనర్‌లో తెరకెక్కించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఎప్పుడు ఒకే తరహా మూవీ అయితే ఎలా మారుతి అంటూ ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దాంతో మారుతి తదుపరి చిత్రం విషయంలో ఆలోచనల్లో పడ్డట్లుగా సమాచారం అందుతుంది. మారుతి ప్రస్తుతం మెగా హీరోతో మూవీకి ఏర్పాట్లు చేస్తున్నాడు.

maruthui

ఆ చిత్రం కోసం కొత్తగా ట్రై చేయాలని ఆయన అభిమానులు సలహా ఇస్తున్నారు. ఎప్పుడు మూస ఎంటర్‌టైనర్‌ కాకుండా కొత్త స్క్రిప్ట్‌తో సినిమా చేస్తే తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మారుతి మాత్రం మరోసారి రెగ్యులర్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఒక చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు చిత్రం 12 కోట్ల షేర్‌ను రాబట్టింది. సేఫ్‌ జోన్‌లోకి ఈ చిత్రం వెళ్లాలి అంటే ఇంకా ఆరు కోట్ల రూపాయలను ఈ చిత్రం రాబట్టాల్సి ఉందని సమాచారం అందుతుంది.

maruthi-director